ఆంధ్రప్రదేశ్ లో కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 6,213 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,82,583 చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. ఒక్కరోజు వ్యవధిలో కోవిడ్ వల్ల చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నంలో ఒక్కొక్క రు చొప్పున మరణించారు. ఇక గడిచిన 24 గంటల్లో 10,795 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 3,25,05,747 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. అనంతపురం 308, చిత్తూరు 228, తూర్పు గోదావరి 731, గుంటూరు 830, వైస్సార్ కడప 462, కృష్ణా 903, కర్నూల్ 679, నెల్లూరు 307, ప్రకాశం 324, శ్రీకాకుళం 195, విశాఖపట్నం 518, విజయనగరం 86, పశ్చిమ గోదావరి 642.
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 6,213 కేసులు
February 01, 2022
0
Tags