1.29 కోట్ల వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయిన జియో

Telugu Lo Computer
0


ప్రైవేట్ టెలికాం సంస్ధలు 20 శాతం మేర ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో  డిసెంబర్ నెలలో మొబైల్ యూజర్లు గణనీయంగా జియోను వదిలి వెళ్లారు. ఆయా యూజర్లు ఇతర నెట్ వర్క్ లో  చేరినట్లు తెలుస్తోంది. జియోతో పాటుగా వొడాఫోన్ ఐడియాకు కూడా యూజర్లు భారీ షాకిచ్చారు. మరోవైపు ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్  ఇదే నెలలో ప్రైవేట్ సంస్థల కంటే ఎక్కువ లబ్ధి పొందింది. గత నెలతో పోలిస్తే డిసెంబర్ 2021లో దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారుల సంఖ్య 1.28 కోట్లు తగ్గిందని ట్రాయ్ డేటా గురువారం వెల్లడించింది. రిలయన్స్ జియో దాదాపు 1.29 కోట్ల వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది. డిసెంబర్ 2021లో దాని మొబైల్ సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య 41.57 కోట్లకు పడిపోయినట్లు ట్రాయ్ వెల్లడించింది. మరో వైపు వోడాఫోన్ ఐడియా కూడా 16.14 లక్షల మంది మొబైల్ సబ్‌స్క్రైబర్‌లను కోల్పోగా, డిసెంబర్ 2021లో దాని బేస్ 26.55 కోట్లకు చేరుకుంది. జియో, వోడాఫోన్ ఐడియా కు యూజర్లు గట్టి షాక్ ఇవ్వగా, ఎయిర్‌టెల్ కు జోష్ నింపారు యూజర్లు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నెలవారీ సబ్‌స్క్రైబర్ డేటా ప్రకారం, ఎయిర్‌టెల్ 4.75 లక్షల మంది కొత్త వినియోగదారులను పొందింది. దీంతో వినియోగదారుల సంఖ్యను 35.57 కోట్లకు పెంచుకుంది.


Post a Comment

0Comments

Post a Comment (0)