అమల్లోకి కొత్త అటెండెన్స్ విధానం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ఉద్యోగులకు నేటి నుంచే  ఫేషియల్ రిక్నగేషన్ అటెండెన్స్ విధానం అమల్లోకి వచ్చింది. సాంకేతిక ఇబ్బందులను అధిగమించేందుకు ప్రతి బ్లాకుకూ ఓ ఐటీ ఇన్ ఛార్జ్ ని కూడా నియమించింది. ఇకపై సచివాలయం నుంచే విధులు నిర్వర్తించాలని అన్ని శాఖల అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. వసతుల్లేవని సాకులు చెప్పొద్దంటూ స్పష్టం చేసింది.  ఏసీలు పని చేయడం లేదంటూ గతంలో రకరకాల కారణాలు చెప్పిన ఉన్నతాధికారులు కరోనా కారణంగా గత రెండేళ్ల నుంచి హెచ్ వోడీ కార్యాలయాల్లోనే విధులు నిర్వహిస్తోన్నారు ఉన్నతాధికారులు. సెక్రటేరీయేట్ కు ఉన్నతాధికారులు రాకపోవడంతో చాలా పనులు పెండింగులో ఉండిపోతున్నాయని ఏపీ సీఎస్ కు వందల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. సచివాలయం నుంచే విధులు నిర్వహించాలని గతంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే మరిన్ని ఫిర్యాదులు అందడంతో తాజాగా ఆదేశాలు సీఎస్ సమీర్ శర్మ జారీ చేసారు.

Post a Comment

0Comments

Post a Comment (0)