దేశంలో కొత్తగా 1,27,952 కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ క్రమంగా తగ్గుతూ వస్తోంది. గడిచిన 10 రోజుల కిందట 3 లక్షలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం మాత్రం కరోనా కేసులు  తగ్గుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,27,952 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,20,80,664 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.60 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 1059 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,01,114 కి చేరింది. రోజు వారీ కేసుల శాతం 7.9% శాతంగా నమోదు కాగా. నిన్నటి కంటే.. 14% శాతం కరోనా కేసులు ఎక్కువగా తగ్గి పోయాయి.ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 13,31,648 కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,30,814 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,68,98,17,199 మందికి కరోనా  కేంద్ర ఆరోగ్య శాఖ వ్యాక్సిన్లు చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)