1.07 లక్షల కొత్త కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ క్రమ క్రమంగా తగ్గుతోంది. మొన్నటి వరకు 3 లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదు అయిన కేసులు నేడు లక్ష కేసులుగా  నమోదు అయ్యాయి. నిన్నటి కంటే నేడు కేసులు కాస్త తగ్గాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం గడిచిన 24 గంటల్లో 1,07,474 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,21,88,138 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 12,25,011 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.90 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 865 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,01,979 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,13,246 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,04,61,148 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,69,46,26,697 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. అలాగే నిన్న ఒక్క రోజే 45,10,770 కరోనా వ్యాక్సిన్లు వేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)