పంజాబ్ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ కాన్వాయ్ భద్రతా లోపం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంది. హుస్పేనివాలాకు ముందే కాన్వాయ్ ను నిరససకారులు అడ్డుకున్నారు. దాదాపు 20నిమిషాల వరకూ స్తంభించిపోవడంతో పర్యటనను రద్దు చేసుకుని మోదీ భటిండా ఎయిర్పోర్టుకు తిరిగి వెళ్లిపోయారు.'మీ సీఎంకు థ్యాంక్స్ చెప్పండి. భటిండా ఎయిర్పోర్టు వరకూ ప్రాణాలతో రాగలిగా' అంటూ కామెంట్ చేశారు. ప్రధాని వస్తుండటంతో అవాంతరాలు లేకుండా చూసుకోవాల్సిన అధికారుల లోపమే దీనికి కారణమని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
సీఎంకు థ్యాంక్స్ చెబుతున్నా: మోదీ
January 05, 2022
0
Tags