సీబీఎస్ నుంచి ఎంజీబీఎస్‌కు ఫ్రీ సర్వీస్ !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లో ఉన్న సీబీఎస్ నుంచి మహత్మ గాంధీ బస్ స్టేషన్ వరకు ప్రయాణించడానికి ఎలక్ట్రానిక్ వాహనాలను ప్రారంభించింది. ఈ ఎలక్ట్రానికి వాహనాల సేవలు పూర్తి గా ఉచితం అని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ఎలక్ట్రానికి వాహనాల ఉచిత సర్వీస్ లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. సీబీఎస్ నుంచి ఎంజీబీఎస్ కు ప్రయాణీకులు వెళ్లడానికి నానా ఇబ్బందులు పడతారు. అక్కడ ఎక్కువ రద్దీ ఉండటం తో పాటు రోడ్డు దాటడం వంటివి ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ వాహనాల ఫ్రీ సర్వీస్ ను ప్రారంభించినట్టు ఎండీ సజ్జనార్ తెలిపారు. దీనిలో వాహనంలో మొత్తం 12 మంది ప్రయాణం చేయడానికి వీలుంటుంది. మొదటి ప్రాధాన్యత వృద్ధులు, వికలాంగలు, గర్భిణులు, రోగులకు ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)