ఒక్కరోజే 13 వేలకు పైగా కేసులు, 9 మంది మృతి!

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 41,771 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 13,474 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో తొమ్మిది మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,579కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 10,290 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 21,11,975 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 1,09,493 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)