ఆర్టీసీ బస్సుల్లో మాస్క్‌ లేకుంటే జరిమానాలు !

Telugu Lo Computer
0


ఆంధ్ర ప్రదేశ్‌ లో నిన్నటి నుంచి ఏపీఎస్ ఆర్టీసీ ఈ కొత్త రూల్‌ ను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తి మాస్క్‌ ధరించనందుకు రూ.50 ఫైన్‌ వేసింది ఏపీఎస్ ఆర్టీసీ. దానికి సంబంధించిన ఓ టికెట్‌ కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ విషయం తెలయడంతో ఆంధ్రప్రదేశ్  వాసులు అలర్ట్‌ అవుతున్నారు. ఇక ఇలాంటి రూల్‌ ను తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కూడా పెట్టాలని కొంత మంది ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ను కోరుతున్నారు. ఇక ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు రెట్టింపు అవుతున్న ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో మాస్కులు తప్పనిసరి చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)