అమర్ జవాన్ జ్యోతి ని యుద్ధ స్మారక జ్యోతిలో కలిపివేత !

Telugu Lo Computer
0


ఇండియా గేట్ వద్ద ఉండే  అమర జవాన్ జ్యోతిని ఈరోజు ఆర్పివేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అమర్ జవాన్ జ్యోతి ని యుద్ధ స్మారక జ్యోతిలో కలపనున్నారు. రెండు జ్యోతులను నిర్వహించడం కష్టంగా ఉన్న కారణంగానే ఈ రెండిటినీ కలిపేయాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 1971 సంవత్సరంలో ఇండియా గేట్ వద్ద అమర్ జవాన్ జ్యోతి ని ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో అమరులైన సైనికుల జ్ఞాపకార్థం అమర్ జవాన్ జ్యోతి ఏర్పాటు చేశారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 1972 సంవత్సరంలో అమర్ జవాన్ జ్యోతి ని ప్రారంభించారు. 2019లో జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)