దేశం లో కొత్తగా 3.47 లక్షల కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశం లో కరోనా థర్డ్‌ వేవ్‌ కొనసాగుతూనే ఉంది. రోజుకు లక్షకు తగ్గకుండా కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,47,254 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,85,66,027 కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 20,18,825 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.62 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 703 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,88,396 కి చేరింది. ఇక అటు ఇండియా వ్యాప్తంగా ఓమిక్రాన్ కేసుల సంఖ్య 9,692 గా నమోదు అయింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 29732 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,60,58,806 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,60,43,70,484 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 70,49,779 మందికి కరోనా వ్యాక్సిన్లు వేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)