ఎన్నికల్లో పోటీకి రడీ : నట్టి కుమార్

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో అప్పుడే ఎన్నికల వేడి కనిపిస్తోంది. ఎన్నికలకు చాలా సమయం ఉన్నా.. ఎన్నికలు జరుగుతున్నాయా అనే స్థాయిలో పొలిటికల్ మాటల మంటలు వినిపిస్తున్నాయి. అధికార వైసీపీ ప్రతిపిక్ష టీడీపీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నాయి. ఎవరూ వెనక్కు తగ్గేదే లే అంటున్నారు. విమర్శలు ప్రతి విమర్శలు.. పరస్పర కేసులతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఓ వైపు గుడివాడ క్యాసినో అంశం.. మరోవైపు పీర్సీసీ ఆందోళనలు, ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు ఇలా మొత్తం ఏపీలో పొలిటికల్ హంగామా కనిపిస్తోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశిస్తే నేరుగా ఎన్నికల్లో పోటీ చేస్తానని, లేదంటే ఆయనకు మద్దతుగా పని చేస్తానని  సినీ నిర్మాత, దర్శకుడు నట్టి కుమార్ అన్నారు.  ఆయన మాటలు చూస్ అతి త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోనుందుకు సిద్ధమయ్యారని, ముహూర్తం ఫిక్స్ అయ్యాకే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని అనిపిస్తోంది. ఎందుకంటే స్వయంగా ఆయనే ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే తాను రాజకీయాల్లోకి రావాలి అనుకోడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది అంటున్నారు నట్టి కుమార్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ కుట్ర వెనుక కొంతమంది అధికారులు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు తొత్తులుగా ఉన్నారని ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు నాయుడుకు తోడుగా సినీ ఫీల్డ్, అధికారులు, రాజకీయ నాయకులు కలిసి కుతంత్రాలు చేస్తున్నారన్నారని ఆరోపించారు. అందుకే ప్రతిపక్షాల కుట్రలను ఎదుర్కోడానికి మాత్రమే తాను రాజకీయాల్లోకి రావాలి అనుకుంటున్నాని, ఫిబ్రవరి 01వ తేదీ నుంచి ప్రజల మధ్యలో ఉంటానని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)