గార పట్టిన పళ్ళు తెల్లగా మెరవాలంటే!

Telugu Lo Computer
0


ఈ రోజుల్లో కాఫీ, టీ తాగటం గుట్కా, పాన్ నమలటం ఎక్కువైపోయింది. దాంతో పళ్ళు పసుపు రంగులోకి మారటం, గార పట్టటం వంటివి జరుగు తున్నాయి. ప్రతి రోజూ బ్రష్ చేసినా సరే ఈ పసుపు రంగు, గార పోదు. ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో సులభంగా తొలగించుకోవచ్చు. ఒక పాకెట్ eno పొడి వేసి, దానిలో అర చెక్క నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని చేతి వేలుతో గాని టూత్ బ్రష్ తో గాని తీసుకుని పళ్ళ పై బాగా రుద్దాలి. ఈ విధంగా రెండు నిమిషాల పాటు చేసిన తర్వాత నోటిని శుభ్రంగా కడగాలి ఈ విధంగా వారంలో రెండు లేదా మూడు సార్లు చేస్తూ ఉంటే క్రమంగా పళ్ళ పై ఉన్న గార., పసుపు రంగు తొలగిపోయి తెల్లగా మెరుస్తూ ఉంటాయి. ఈనో నోటిలోని బ్యాక్టీరియాను తొలగించడంతో పాటు దంతాలు గట్టిగా ఉండేలా చేస్తుంది. పిప్పి పన్ను సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగి స్తుంది. ఈనో లో బేకింగ్ సోడా ఉండటం వలన దంతాలు తెల్లగా మార్చడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. నిమ్మలో విటమిన్ సి, బ్లీచింగ్ లక్షణాలు ఉండటం వల్ల పంటి మీద పసుపు రంగు తొలగిపోయి తెల్లగా రావడానికి సహాయపడుతుంది. ఇటువంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా తెల్లని,మెరిసే దంతాలను సొంతం చేసు కోవచ్చు. నిమ్మకాయ, Eno రెండు అందుబాటులో ఉంటాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)