హైదరాబాద్‌లో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్‌

Telugu Lo Computer
0


హైదరాబాద్‌ నగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముంబై ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నార్త్‌, వెస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ సందర్భంగా ముగ్గురు సభ్యుల ముఠాను తమ ఆదీనంలోకి తీసుకున్నారు. వారివద్ద లభించిన కొకైన్, ఎల్‌ఎస్‌డీ, మత్తు పదార్థాలను సీజ్‌ చేశారు. కొత్త ఏడాది వేడుకలకు ముంబై నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తించారు. ముంబైకి చెందిన ప్రధాన నిందితుడు సోనీ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడు అంతర్జాతీయంగా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు భావిస్తున్నారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)