గ్రామ, వార్డు సచివాలయాల్లో మినీ ఫిష్ రిటైల్ అవుట్ లెట్లను ఏర్పాటు చేయనున్నామని, వాటి ద్వారా చేపలు విక్రయించేందుకు చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్ అధికారులను పేర్కొన్నారు. కలెక్టరేట్లో బుధవారం దీనిపై సమీక్ష నిర్వహించారు. పాలకొండ, శ్రీకాకుళం, పలాసల్లో మూడు హబ్లు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెప్పారు. వాటి నుంచి 30 నుంచి 35 కిలోమీటర్లకు ఒక్కోటి చొప్పున రిటైల్ అవుల్లెట్లను పెడతామన్నారు. ఈ సందర్భంగా మార్కెటింగ్శాఖ జేడీ శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతుబజారులో స్టాళ్లు ఖాళీగా ఉంటే చేపలు విక్రయించేందుకు అద్దెకు కేటాయిస్తామని చెప్పారు.
సచివాలయాల ద్వారా చేపల విక్రయాలు
January 06, 2022
0