కృష్ణా నదిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు గ్రామానికి చెందిన ఏడో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు కృష్ణా నదిలో గల్లంతు అయ్యారు. సంక్రాంతి సెలవులు కావడంతో ఏడో తరగతి చదువుతున్న ఐదుగురు పిల్లలు కృష్ణా నది ఈత కొట్టడానికి వెళ్లారు. దీంతో ఆ ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది  వారికి కోసం గాలించగా నది ఓడ్డున వారి బట్టలు కనిపించడంతో నదిలో గల్లంతు అయినట్లు తెలుసుకున్నారు. దీంతో పోలీసులు, గజ ఈత గాళ్లు విద్యార్థుల కోసం కృష్ణా నదిలో గాలిస్తున్నారు. కాగ కృష్ణా నదిలో గల్లంతు అయిన వారు ఐదుగురు కూడా ఏటూరు గ్రామానికి చెందిన వారే. అందులో కర్ల బాలయేసు (12), మైల రాకేష్ (12), మాగులూరి సన్నీ (12), జెర్రిపోతుల చరణ్, (13), జెట్టి అజయ్ (12) ఉన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)