తిరుపతికి వెళ్లి భాస్కర్ నాయుడు ఎవరూ అని ఎవర్ని అడిగినా చెబుతారు. అతను సెలబ్రిటీ కాకపోయినా..మనుషుల ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకరమైన విషసర్పాలు, బుసలు కొట్టే నాగుపాములను ఒంటి చెత్తో పట్టుకుంటాడు. తిరుపతి, తిరుమల పరిసరాల్లో ఎక్కడ పాములు ఉన్నాయన్న అక్కడ క్షణాల్లో వాలిపోయి వాటిని జాగ్రత్తగా పట్టుకొని ఎవరికి ఎలాంటి ప్రాణహాని తలపెట్టకుండా వాటిని తీసుకెళ్లి దూరంగా ఫారెస్ట్లో వదిలేస్తాడు. అందుకే భాస్కర్నాయుడ్ని స్నేక్నాయుడు అని కూడా తిరుపతి, తిరుమలలో పిలుస్తుంటారు. అటవీశాఖలో మజ్ధూర్గా రిటైర్ అయినప్పటికి భాస్కర్నాయుడు సేవలను టీటీడీ ఇంకా కొనసాగిస్తూ వస్తోంది. భాస్కర్నాయుడు ఇప్పటి వరకూ సుమారు 10వేల పాముల్ని పట్టుకున్నారు. ఎంతో మందికి పాములను చూసి భయపడవద్దని అవగాహన కల్పించారు. కానీ ప్రస్తుతం ఆయనే పాము కాటుకు గురయ్యారు. ప్రాణపాయస్థితిలో ఉన్న భాస్కర్ నాయుడిని ముందుగా తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అతని ఆరోగ్యం విషమంగానే ఉందని వైద్యులు చెప్పడంతో రేణిగుంటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. భాస్కర్నాయుడు శరీరంలోకి పాము విషం చేరి 24గంటలు గడిచిపోవడంతో అతని ఆరోగ్య పరిస్థితిపై గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నారు వైద్యులు. రెండ్రోజుల క్రితం పాము తమ ప్రాంతానికి వచ్చిందని తిరుపతిలో ఎవరో సమాచారం ఇచ్చారు. దాన్ని పట్టుకునేందుకు వెళ్లారు భాస్కర్ నాయుడు. పామును పట్టుకునే క్రమంలో అది కాటేయడంతో అస్వస్థతకు గురయ్యారు. భాస్కర్ నాయుడ్ని కాటేసిన పాము అత్యంత విషపూరితమైనది కావడంతో అతడ్ని వెంటనే స్విమ్స్కు తరలించారు. అక్కడ వైద్యులు మెరుగైన వైద్యం అందించాలని సూచించడంతో రేణిగుంటలోని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చారు.
ప్రాణాపాయ స్థితిలో భాస్కర్ నాయుడు
January 31, 2022
0
Tags