ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు క్రమ క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం ఈరోజు రెండు లక్షలకు కరోనా కేసులు చేరువయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,94,720 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 35,018,358 కు చేరింది. దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 9,55,319 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.62 శాతంగా నమోదు కాగా… రోజు వారీ పాజిటివిటీ రేటు 11.05 శాతంగా నమోదు అయింది. ఇక దేశంలో తాజాగా 442 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,84,655 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 60405 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 34,321,803 కు చేరింది. ఇలాగే ఇండియాలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,868 గా నమోదు అయింది.
1.94 లక్షల కొత్త కేసులు నమోదు
January 12, 2022
0