కేసీఆర్ ఫామ్ హౌస్‌లో యువకుడి మృతి

Telugu Lo Computer
0


తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ క్షేత్రంలోకి చాలా మంది కూలీలు పని కోసం వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఎర్రవల్లి పక్కనే ఉన్న వరద రాజాపూర్ గ్రామానికి చెందిన ఆంజనేయులు (19) మంగళవారం ఫామ్ హౌస్ లో కూలి పనులకోసం వెళ్లాడు. అయితే ఆయన అక్కడ పని చేస్తున్నక్రమంలో ఓ బావి వద్ద చెట్ల పొదలు ఉన్నాయి. వాటిని తొలగించాలని అధికారులు చెప్పడంతో వాటిని తొలిగిస్తూ ఆ బావిలో జారిపడిపోయాడు. అతన్ని బావిలో నుంచి బయటకు తీసేసరికి అతను చనిపోవడంతో ఎర్రవల్లి ఫాహౌస్ ముందు అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

Post a Comment

0Comments

Post a Comment (0)