పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ లో ఏడు పేపర్లే !

Telugu Lo Computer
0


కరోనా కారణంగా ఈ అకడమిక్ ఇయర్ లో విద్యార్థులు చాలా కాలం పాటూ ఆన్ లైన్ లోనే పాఠాలు విన్నారు. ఇక మొబైల్ ఫోన్ లు, టాబ్ లు లేని వారు ఆన్లైన్ క్లాసులు కూడా వినలేకపోయారు. దాంతో పదో తరగతి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి విద్యావిధానంలో స్వల్ప మార్పులు చేసింది. కరోనా కారణంగా విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళన తగ్గించేందుకు పరీక్షా పత్రాలను కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. 2022 విద్యాసంవత్సరం నుండి పదో తరగతిలో ఏడు పేపర్లు మాత్రమే ఉంటాయని స్పష్టం చేసింది. అంతే కాకుండా ఈ విధానంలోనే 2022 సంవత్సరపు పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయని వెల్లడించింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ లో కూడా ఏడు పేపర్లు ఉంటాయని పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)