మల్లెమాల సుందర రామిరెడ్డి

Telugu Lo Computer
0


మల్లెమాల తెలుగు రచయిత, సినీ నిర్మాత. ఎంఎస్ రెడ్డి పూర్తి పేరు మల్లెమాల సుందర రామిరెడ్డి . ఆయన ఇంటిపేరు ‘మల్లెమాల’ను కలం పేరుగా మార్చుకొని దాదాపు 5,000 వేలకు పైగా కవితలు, సినీ గేయాలు రచించి "సహజ కవి"గా ప్రశంసలందుకున్నారు. 1924, ఆగస్టు 15 న నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం అలిమిలి లో ఆయన జన్మించారు. మద్రాసులో మొదట ఫోటో స్టుడియో తో వీరి జీవితాన్ని ప్రారంభించారు. ఈయన చెన్నై లో సినిమా థియేటర్ నిర్మించిన తొలి తెలుగు సినీ నిర్మాత. నిర్మాతగా ఆయన తొలి చిత్రం భార్య. శ్రీకృష్ణ విజయం, కోడెనాగు, ఏకలవ్య, పల్నాటి సింహం, అమ్మోరు, ముత్యాల పల్లకి, అంజి, తలంబ్రాలు, అంకుశం, ఆహుతి, అరుంధతి లాంటి చిత్రాలు నిర్మాతగా ఎంఎస్ రెడ్డికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. మొత్తం బాలలతో తీసిన రామాయణం సినిమా జూనియర్ ఎన్టీఆర్ ను బాల నటుడిగా తెరమీదకు తీసుకుని వచ్చింది. అంకుశం చిత్రంలో ఆయన ముఖ్యమంత్రి గా నటించారు.

వీరు స్థాపించిన శబ్దాలయ థియేటర్స్ సినీ డబ్బింబ్, రికార్డింగ్ లో అత్యున్నత సాంకేతిక విలువలు కలిగినదిగా సినీ వర్గాలు చెబుతారు.

ఒక కవిగా రచించిన గొప్ప పద్యం ,  

రసపిపాస లేని రాలుగాయల మధ్య

చెప్పు కవిత యెంత గొప్పదయిన

కోళ్ల సంతలోన కోహినూరు వజ్రమే,

మహిత వినయ శీల మల్లెమాల.

హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని ఆయన స్వగృహంలో 2011, డిసెంబర్ 11 న కన్నుమూశారు. ఆయన తనయుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి కూడా చిత్ర నిర్మాత. వీరు రచించిన 'మల్లెమాల రామాయణం' ఒక విశిష్టమైన స్థాయిలో నిలిపింది. వీరు రచించిన స్వీయచరిత్ర "ఇది నా కథ" ఎందరో సినీ ప్రముఖులని విమర్శించిన నిర్మొహమాటపు రచనగా పేర్కొనవచ్చును. భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - రామాయణం. రఘుపతి వెంకయ్య పురస్కారం

Post a Comment

0Comments

Post a Comment (0)