నగరి ఎమ్మెల్యే రోజా నోరు అదుపులో పెట్టుకోవాలనీ, లేదంటే చెంపలు పగులుతాయని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు చక్రాల ఉష ఒక ప్రకటనలో హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా నారా భువనేశ్వరి వరద బాధితులకు సాయం అందించి ఆదుకున్నట్లు ఆమె చెప్పారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో తనను అవమానించిన వారి గురించి ఆమె హుందాగా మీడియాకు సమాధానం చెప్పారన్నారు. ఎవరినీ నిందించలేదనీ, పేరు కూడా ప్రస్తావించలేదని గుర్తుచేశారు. అయితే సీఎం జగన్ మెప్పు కోసం, మంత్రి పదవి దక్కించుకోవాలన్న ఆశతో ఇష్టారాజ్యంగా రోజా విమర్శలకు దిగితే తెలుగు మహిళలు ఊరుకోరన్నారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు వరద ధాటికి ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆమె ఎక్కడున్నారని ప్రశ్నించారు.
నోరు అదుపులో పెట్టుకో....!'
December 23, 2021
0