వివాహిత ఆత్మహత్య

Telugu Lo Computer
0


తెలంగాణలోని వరంగల్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌ బుడ్గజంగాల కాలనీకి చెందిన పస్తం సుజాత (28)కు వివాహం కాగా భర్త నుంచి విడాకులు తీసుకుని మంచిర్యాలలో నివాసముంటోంది. అక్కడే మహ్మద్‌ షకీర్‌ అనే వ్యక్తితో సుజాతకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని మహ్మద్‌ షకీర్‌ చెప్పడంతో ఇద్దరూ ఏడాది కాలంగా సహజీవనం సాగిస్తున్నారు. ఇటీవల సుజాత పెళ్లి చేసుకోవాలని కోరడంతో అతను నిరాకరించాడు. దీంతో మానసిక వేదనకు గురైన ఆమె ఈ నెల 28న ముల్కనూర్‌కు వచ్చి, అదే రోజు సాయంత్రం పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు 108 ద్వారా వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. మృతురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)