ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌ సభ్యుల రాజీనామాల ఆమోదం !

Telugu Lo Computer
0


'మా' ఎన్నికల్లో ప్రకాష్‌ రాజ్‌ ప్యానల్‌ తరఫున గెలుపొందిన సభ్యుల రాజీనామాలను ఆమోదించారు. ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌ నుండి శ్రీకాంత్‌, ఉత్తేజ్‌ సహా మొత్తం 11 మంది సభ్యులు గెలిచారు. ఆ తర్వాత వారు తమ పదవికి రాజీనామా చేశారు. మంచు విష్ణు మాట్లాడుతూ రాజీనామాలు చేయొద్దని ప్రకాష్‌ ప్యానెల్‌ నుండి గెలిచిన సభ్యులను కోరామని, వెనక్కి తీసుకోమని చెప్పినా వాళ్లు అంగీకరించలేదన్నారు. అందుకే చివరికి వారి రాజీనామాలను ఆమోదించామని మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. 'మా' సభ్యత్వానికి ప్రకాష్‌ రాజ్‌, నాగబాబు లు రాజీనామా చేయగా వారి రాజీనామాను ఆమోదించలేదని విష్ణు తెలిపారు. 'మా' భవనంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. త్వరలోనే నిర్ణయం తీసుకుని ప్రకటిస్తామని అన్నారు. 

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)