రాజాం స్కూల్‌లో కరోనా కలకలం!

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా రాజాం లో జిఎంఆర్  వరలక్ష్మీ డిఏవి పబ్లిక్ స్కూల్‌లో కరోనా కలకలం రేపింది.15 మందికి కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయగా తొమ్మిది మందికి పాజిటివ్‌గా తేలిందని అధికారులు తెలిపారు. దీంతో పాజిటివ్ వచ్చిన వారికి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ను ట్రేస్ చేశామన్నారు. మొత్తం 190 మందికి టెస్టులు చేసినట్లు అధికారులు చెప్పారు. స్కూల్‌ను మొత్తం శానిటైజ్ చేసి ప్రత్యేక టెస్టింగ్ క్యాంప్‌ను ఏర్పాటు చేశామన్నారు. పాజిటివ్ వచ్చినవాళ్లలో టీచర్లు, స్టూడెంట్లు ఉన్నట్లు తెలిపారు అధికారులు.


إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)