తొలి టెస్టులో ఇండియా విజయం

Telugu Lo Computer
0


సెంచూరియన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఇండియా 113 పరుగుల తేడాతో గెలిచింది.  305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 191 పరుగులకే ఆలౌటైంది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలో నిలిచింది. నాలుగో రోజు ఆట ముగిసే సరికి 94/4తో ఉన్న దక్షిణాఫ్రికా మరో 97 పరుగులు జోడించి మిగతా ఆరు వికెట్లను చేజార్చుకుంది. భారత బౌలర్లలో బుమ్రా, మహమ్మద్‌ షమి తలో మూడు, మహమ్మద్‌ సిరాజ్‌, అశ్విన్‌ చెరో రెండు వికెట్లు తీశారు. సెంచూరియన్‌ మైదానంలో టీమ్‌ఇండియా తొలి విజయం ఇదే కావడం విశేషం. ఐదో రోజు తొలి సెషన్‌లో కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ (77: 156 బంతుల్లో 12×4), తెంబా బవుమా (35 నాటౌట్‌: 80 బంతుల్లో 4×4) కాసేపు వికెట్‌ కాపాడుకుంటూ జాగ్రత్తగా ఆడారు. మ్యాచ్‌ను డ్రా దిశగా తీసుకెళ్తున్నారనుకుంటున్న తరుణంలో.. భారత్‌కు బుమ్రా బ్రేక్‌ ఇచ్చాడు. ఇన్నింగ్స్‌ 51వ ఓవర్లో ఎల్గర్‌ని బుమ్రా ఔట్‌ చేశాడు. దీంతో భారత్‌కి ఉపశమనం లభించింది. ఆ తర్వాత వెనువెంటనే క్వింటన్ డి కాక్‌ (21), వియాన్‌ ముల్డర్ (1) పెవిలియన్‌ చేరారు. లంచ్‌ తర్వాత వచ్చినవాళ్లు వచ్చినట్లు వెనుదిరగడంతో... దక్షిణాఫ్రికా పోరు ముగిసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)