భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కరోనా బారిన పడ్డారు. గత రెండు మూడు రోజులుగా కాస్త నలతగా ఉండటంతో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కరోనా టెస్టులు చేయించుకోగా పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం ఆయన కోల్ కతా లోని వుడ్ ల్యాండ్స్ హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతున్నారని సమాచారం. బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీకి సోమవారం రాత్రి కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించగా.. రిపోర్టులో కొవిడ్19 పాజిటివ్గా వచ్చింది. గంగూలీకి కరోనా వైరస్ సోకడం ఇది తొలిసారి. గతంలో ఐపీఎల్ 2021కు కొన్ని రోజుల ముందు గంగూలీ కుటుంబ సభ్యులు కరోనా బారిన పడ్డారు. తాజాగా గంగూలీ సైతం కోవిడ్ బారిన పడినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఏడాది ఆరంభంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసుపత్రి పాలయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు యాంజియోప్లాస్టీ చేశారని తెలిసిందే.
సౌరవ్ గంగూలీకి కరోనా పాజిటివ్
December 28, 2021
0