వాహనాన్నిగుర్తు పట్టి... తీసుకెళ్లండి...!

Telugu Lo Computer
0


మీ వాహనం పోయిందా.. పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారా.. అయితే ఈ వాహనాల్లో మీ వాహనం ఉందా గుర్తు పట్టండి. పత్రాలను సమర్పించి తీసుకువెళ్లండని అంటున్నారు రాచకొండ పోలీసులు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో రోడ్లపై, జనసంచారం లేని ప్రాంతాల్లో వదిలేసి వెళ్లిన 559 ద్విచక్ర వాహనాలను అంబర్‌పేటలోని రాచకొండ కార్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో భద్రపర్చారు. ఈ వాహనాలను తీసుకువెళ్లడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో వాటిని బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయా వాహనాల యజమానులు వివరాలను www.rachakondapolice.telangana.gov.in లో సెర్చ్‌ చేసి చూసుకోవచ్చన్నారు. లేదా అంబర్‌పేట కార్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో అదనపు డీసీపీ కార్‌ హెడ్‌ క్వార్టర్స్‌ అధికారిని, కార్యాలయంలో సంప్రదించి వాహనాలకు సంబంధించిన పత్రాలను సమర్పించి తీసుకోవాలని కోరారు. ఈ ప్రకటన విడుదలైన తేదీ నుంచి 15 రోజుల వరకు తీసుకెళ్లడానికి సమయం ఉంటుందని తెలియజేశారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)