అన్నపురెడ్డిపల్లి గురుకుల కళాశాల అధ్యాపకురాలు అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇల్లందు మండలంలోని రొంపేడు గ్రామానికి చెందిన సువర్ణపాక కల్యాణి (26)రెండేళ్లుగా అన్నపురెడ్డిపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో టీజీటీ సైన్స్ అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం పాఠశాలలో విధులు ముగిసిన అనంతరం విశాంత్రి తీసుకునేందుకు కళాశాలలో ప్రాంగణంలో తనకు కేటాయించిన గదికి వెళ్లారు. రాత్రి అయినా గది నుంచి ఎంతకీ రాకపోవడంతో సహ అధ్యాపకులు వెళ్లి చూశారు. తన గదిలో ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని కనిపించడంతో హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై తిరుపతిరావు ఘటనాస్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు. అధ్యాపకురాలి మృతిపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Advertisement