వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేటును 5% నుంచి 12%కి పెంచుతూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ టాక్సెస్ నోటిఫై చేయడంతో జనవరి నుంచి దుస్తులు, వస్త్రాలు, పాదరక్షల ధరలు పెరగనున్నాయి. నిర్దిష్ట సింథటిక్ ఫైబర్లు, నూలుపై జీఎస్టీ రేట్లు 18% నుంచి 12%కి తగ్గించారు. సెప్టెంబరులో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో టెక్స్టైల్, పాదరక్షలపై విధించే వస్తు సేవల పన్నును సవరించారు. జనవరి1 నుంచి దుస్తులపై జీఎస్టీ రేటు 12% ఉంటుంది. ఇంతకుముందు ఇది దుస్తులు ధరపై జీఎస్టీ 5%గా ఉండేది. వచ్చే ఏడాది నుంచి ప్రధానంగా ఆన్లైన్ ద్వారా అందించే సేవలపైన ఇ-కామర్స్ సంస్థలు పన్ను చెల్లించాలి.
దుస్తులు, పాదరక్షలపై జీఎస్టీ పెంపు !
December 27, 2021
0
Tags