ప్రొడక్షన్‌ మేనేజర్‌పై కేసు నమోదు

Telugu Lo Computer
0


అల్లు అర్జున్‌ను కలిసేందుకు అవకాశం ఇస్తున్నట్లు పుష్ప చిత్ర బృందం నుంచి అభిమానులకు సమాచారం వచ్చింది. అక్కడ ఫొటో దిగేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో సోమవారం సాయంత్రం ఎన్‌.కన్వెన్షన్‌ వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు చేరారు. భారీ సంఖ్యలో జనం వచ్చినట్టు తెలుసుకున్న అల్లు అర్జున్‌ కార్యక్రమానికి వెళ్లలేదు. రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. నిరుత్సాహానికి గురైన అభిమానులు నినాదాలు చేశారు. ఒకేసారి ముందుకు నెట్టుకుంటూ వెళ్లటంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. పోలీసులకు లాఠీలకు పని చెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎన్‌.కన్వెన్షన్‌లో 500 మందికి అనుమతి తీసుకున్నట్లు మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ రవీంద్రప్రసాద్‌ తెలిపారు. అందుకు భిన్నంగా అక్కడకు 1000-2000 మంది చేరారు. తప్పడు వివరాలతో అనుమతి తీసుకున్న ప్రొడక్షన్‌ మేనేజర్‌పై కేసు నమోదు చేసినట్టు ఇన్‌స్పెక్టర్‌ చెప్పారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)