ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన నియోజకవర్గం వారణాసిలో బిజీబిజీగా గడుపుతున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రదాని సోమవారం కాశీ వెళ్లిన విషయం తెలిసిందే. నిన్న ఉదయం నుంచి ఆలయ దర్శనాలు, పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మోదీ.. సాయంత్రం భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలతో భేటీ అయ్యారు. ఈ సమావేశం అర్ధరాత్రి వరకూ సాగింది. ఆ తర్వాత అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో మోదీ నగరంలో లేట్ నైట్ టూర్కు వెళ్లారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి కొంతసేపు కాశీ వీధుల్లో నడిచారు. పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పనులను పరిశీలించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మోదీ తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. ''కాశీలో పలు అభివృద్ధి పనులను పరిశీలించాం. ఈ పవిత్ర నగరంలో ఉత్తమ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మరింత కృషి చేస్తున్నాం'' అని మోదీ తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాలతో పాటు బనారస్ రైల్వే స్టేషన్ను ప్రధాని సందర్శించారు.
కాశీ వీధుల్లో అర్ధరాత్రి కాలినడకన....!
December 14, 2021
0
Tags