హ్యాకర్స్ సెలబ్రిటీల ట్విట్టర్ ఖాతాలపై ఫోకస్ చేస్తున్నారు. కొన్ని రోజుల కిందట ప్రపంచ వ్యాప్తంగా టాప్ టెక్ దిగ్గజాలు, బిలియనీర్ల ట్విట్టర్ అకౌంట్లు హ్యాకింగ్ కావడం తెలిసిందే. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి హ్యాకర్లు షాకిచ్చారు. నరేంద్ర మోదీ ట్విట్టర్ అకౌంట్ ను ఆదివారం ఉదయం 2 గంటల ప్రాంతంలో హ్యాకర్స్ ఆధీనంలోకి తీసుకున్నారు . ఈ విషయాన్నిపీఎంవో తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఆదివారం ఉదయం 3 గంటల ప్రాంతంలో తెలియజేసింది. హ్యాకింగ్ విషయాన్ని ట్విటర్ కు తెలియజేశామని పీఎంవో పేర్కొంది. వెంటనే ట్విటర్ ప్రధాన మంత్రి ఖాతాకు భద్రత కల్పించిందని తెలిపింది. అయితే హ్యాకర్స్ నరేంద్ర మోదీ ట్విటర్ అకౌంట్ నుంచి ఓ పోస్టు పెట్టింది. ఆదివారం 2 గంటల ప్రాంతంలో ట్విటర్లో నరేంద్రమోదీ ఖాతా నుంచి హ్యాకర్లు ఒక సందేశం పెట్టారు. బిట్ కాయిన్లను ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిందని ఆ పోస్టులో తెలిపారు. అంతేకాకుండా బిట్కాయిన్ల కోసం టెండర్లను ప్రభుత్వం పిలిచిందని తెలిపారు. ప్రభుత్వం అధికారికంగా 500 బిట్ కాయిన్లు కొనుగోలు చేసిందని, దేశంలోని ప్రజలందరికీ బిట్కాయిన్లు పంచబోతుందంటూ హ్యాకర్స్ ప్రధానమంత్రి ట్విటర్లో పోస్టు పెట్టడం సంచలనం రేకెత్తించింది. దీంతో అప్రమత్తమైన పీఎంవో తన ట్విట్టర్ హ్యాండిల్ లో.. " PM @narendramodi ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్కు గురైందను ట్విట్టర్కు తెలియజేయడంతో వెంటనే మోదీ ఖాతాకు భద్రత కల్పించారు. ఖాతా హ్యాక్ అయిన ఆ సమయంలో ఏదైనా సందేశం వస్తే వదిలివేయండి" అని పేర్కొంది.
మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్...!
December 12, 2021
0
Tags