భారత్ లో ఒకే రోజు 16,500 పాజిటివ్ కేసులు

Telugu Lo Computer
0


భారత్ లో రోజు రోజుకు కరోనా కేసులు  పెరిగిపోతున్నాయి. ముందు రోజుకు దాన్ని తర్వాతి రోజుకు అసలు సంబంధమే లేనట్లుగా కేసుల ఉధృతి కొనసాగుతోంది. 24గంటల్లో 16 వేల 500లకుపైగా కేసులు నమోదయ్యాయి. ఇది అంతకముందు రోజు కంటే 27శాతం ఎక్కువ. ఈ మూడు రోజుల్లోనే కరోనా కేసుల 2.6శాతం మేర పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మొన్న 9 వేల కేసులు, నిన్న 13 వేల కేసులు, ఇవాళ 16 వేల కేసులు… ఇలా రోజురోజుకు కరోనా వేగం పెంచుకుంటుపోతోంది. పరిస్థితి ఇలానే కొనసాగితే మరో వారంలోనే కరోనా పీక్‌ స్టేజ్‌కు వెళ్లడం ఖాయమని నిపుణులు అంటున్నారు.  అటు మెట్రో నగరాలపై కరోనా పంజా విసిరింది. ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత దేశంలోని ఐదు మెట్రో నగరాల్లో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కోల్‌కతాలో అయితే అంతకముందు రోజుతో పోల్చితే 102శాతం మేర కేసులు రికార్డయ్యాయి. నిన్న 540 కరోనా కేసులు నమోదవ్వగా, ఈరోజు ఆ సంఖ్య దాదాపు 11వందలకు చేరింది. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ఒమిక్రాన్‌ కేసుల కట్టడికి కీలక నిర్ణయం తీసుకుంది. యూకే నుంచి కోల్‌కతాకు వచ్చే విమానాలపై సస్పెండ్ విధించింది. అటు ఢిల్లీలో 24గంటల్లో 13వందల కరోనా కేసులు రికార్డయ్యాయి. ఏడు నెలల తర్వాత కరోనా కేసుల సంఖ్య వెయ్యి మార్కును దాటింది. మే 26 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ముంబైలో అత్యంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్క ముంబైలోనే 3వేల ఆరు వందలకు పైగా కొవిడ్‌ కేసులు వెలుగు చూశాయి. ఇది ముందురోజుతో పోల్చితే 47 శాతం ఎక్కువ. కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు బృహన్‌ ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌ చర్యలు చేపట్టింది. వార్డు-స్థాయి వార్ రూమ్‌లను తిరిగి యాక్టివ్ చేసింది. ముంబైలో ఇప్పటికే న్యూయర్‌ వేడుకలపై నిషేధం విధించారు. . వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి ముంబై మహానగరంలో పోలీసులు 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)