ఉత్తరకొరియాలోని కిమ్ ప్రభుత్వం రెండు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆదేశ ప్రజలు నవ్వకూడదని, అదే సమయంలో మద్యం సేవించకూడదని ఆదేశాలు జారీ చేసింది. కిమ్ ప్రభుత్వం 11 రోజుల పాటు దేశ ప్రజలు నవ్వకూడదని అదే సమయంలో మద్యం కూడా సేవించకూడదని కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఆ దేశ ప్రజల ప్రాణాలు కిమ్ గుప్పిట్లో ఉన్నాయని చెప్పక తప్పదు. ఎందుకంటే పొరపాటున ఎవరైనా నవ్వడం కనిపించారో అంతే సంగతులు. ఇంతకీ ఎందుకు నవ్వకూడదని చెప్పారంటే, కిమ్ తండ్రి ఆదేశ మాజీ అధ్యక్షుడు కిమ్ జాంగ్ -2 పదేళ్ల క్రితం మరణించారు. అప్పుడెప్పుడో పదేళ్ల క్రితం మరణిస్తే ఇప్పుడు ఆదేశంలో 11 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. ఈ 11 రోజుల పాటు ఎవరైనా శుభకార్యాలు చేసుకున్నా, ఆనందంతో గడిపినా, సంతోష సంకేతాలు పంపినా వారింట్లో మరణ మృదంగం మోగుతుందంటూ ఆదేశాలు జారీ చేశారు.
11 రోజుల పాటు సంతాప దినాలు..!
December 17, 2021
0