మాయావతికి మాతృ వియోగం

Telugu Lo Computer
0

 

“బహుజన్ సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి సోదరి మాయావతి గౌరవనీయమైన తల్లి, శ్రీమతి రాంరతి 92 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.” అంటూ బీఎస్పీ నేత సతీష్ చంద్ర మిశ్రా పార్టీ తరపున ఓ ప్రకటన చేశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె, తుది శ్వాస విడిచినట్లు పార్టీ వెల్లడించింది. గత సంవత్సరం నవంబర్ 19వ తేదీన మాయావతి తండ్రి ప్రభుదయాల్ చనిపోయారు. ఈ విషయమై బీఎస్‌పీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ''ఈ వార్త చాలా బాధాకరం. బీఎస్‌పీ జాతీయ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మాయావతి తల్లి రాంరతి కొద్ది సేపటి క్రితం ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో మరణించారు. తల్లి అంత్యక్రియల నిమిత్తం కుమారి మాయావతి ఢిల్లీకి బయలుదేరారు'' అని ట్విట్టర్‌లో ప్రకటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)