మహిళా వాలంటీర్‌పై వైసీపీ నేతల దౌర్జన్యం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండల పరిధిలోని శెట్టివానత్తం గ్రామంలో అనిత అనే మహిళ వాలంటీర్ గా పనిచేస్తున్నారు. గ్రామ సచివాలయంలోనే శనివారం నాడు అధికార వైసీపీకి చెందిన పలువురు నాయకులు తనపై దాడి చేశారని వాలంటీర్ అనిత పేర్కొన్నారు. గ్రామ సచివాలయంలోనే సెక్రటరీ, ఇతర సిబ్బంది చూస్తుండగానే రెడ్డి కులానికి చెందిన వైసీపీ నేతలు తనపై దాడి చేసి, కులం పేరుతో బండబూతులు తిట్టారని బాధితురాలు ఆరోపించారు. సచివాలయంలో వైసీపీ నేతలు దాడి చేయడం, కులం పేరుతో దూషించిన ఘటనపై ఎస్ఆర్ పురం పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళా వాలంటీర్ అనిత తనకు న్యాయం చేయాల్సిందిగా పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. భూవివాదాలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. మూడు నెలల కిందట వాలంటీర్ అనితకు చెందిన భూమిలో అదే ఊరికి చెందిన అగ్ర కులాలకు చెందిన వైసీపీ నాయకులు రాత్రికి రాత్రి వేరుశనగ పంట వేయడంతో అప్పట్లో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాటి ఘటనను మనసులో పెట్టుకుని, విచారణను అడ్డంపడటమే కాకుండా వైసీపీ నేతలు ఇప్పడు ఏకంగా దౌర్జాన్యానికి దిగారంటూ బాధిత మహిళ వాపోయింది. తనను కులం పేరుతో దూషించారంటూ బాధితురాలైన మహిళా వాలంటీర్ అనిత ఫిర్యాదు చేసినప్పటికీ, పోలీసులు మాత్రం సచివాలయ సిబ్బందిపై దాడి చేశారని పేర్కొంటూ వైసీపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేస్తామని ఎస్ఆర్ పురం పోలీసులు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)