గూడూరులో ఏఎస్సైపై దాడి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని, నెల్లూరు జిల్లా గూడూరు పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై గోపాల్‌పై పట్టణానికి చెందిన రాజేష్‌ అనే వ్యక్తి దాడి చేసిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఎస్సై వెంకటనారాయణ తెలిపిన వివరాల మేరకు.. నిందితుడు రాజేష్‌ తనకు సంబంధించిన పాత కేసులో పోలీసులు పట్టించుకోలేదని, అసలైన ముద్దాయిలపై చర్యలు తీసుకోకుండా వదిలేశారని పోలీసులను బస్టాండు కూడలి వద్ద దుర్భాషలాడాడు. దీంతో అక్కడే ఉన్న ఏఎస్సై గోపాల్‌ కలుగజేసుకొని ఎందుకు అలా మాట్లాడుతున్నావని అడుగగా అతనిపై దాడి చేశాడు. దీంతో ఏఎస్సై ముక్కు నుంచి రక్తస్రావమైంది. విధుల్లో ఉన్న పోలీస్‌ అధికారిపై దాడి చేయడంతో నిందితునిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఇటీవల కోడుమూరు ఎస్సైపై దాడి చేసిన విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)