తమిళనాడు విల్లుపురం జిల్లాలో బాణాసంచా పేలుడు ఇద్దరిని బలితీసుకుంది. రెండు బ్యాగుల నిండా టపాసులు కొనుక్కుని బైక్పై ఇంటికి వెళ్తుండగా.. పేలుడు జరిగి తండ్రి కలైనేసన్, కొడుకు ప్రదీష్(7) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. ఐతే.. పేలుడు తీవ్రతను బట్టి తీసుకెళ్తున్నవి టపాసులా.. లేక నాటు బాంబులా అని పోలీసులు అనుమానిస్తున్నారు.