అంతఃపురంలో సౌందర్య పాత్ర నేను చేస్తే బాగుండనిపించింది!

Telugu Lo Computer
0


తన కెరీర్​లో ఎన్నో పాత్రలు చేసినప్పటికీ నరసింహా సినిమాలోని నీలాంబరి పాత్ర ఎంతో స్పెషల్​ అని రమ్యకృష్ణ తెలిపారు. మరోవైపు, అమ్మోరు సినిమా తనకు మంచి గుర్తింపు తెచ్చిందని అన్నారు. ఆ సినిమా విడుదలైన కొద్ది రోజుల తర్వాత.. ఏదో షూటింగ్​లో ఉండగా.. కొంత మంది మహిళలు వచ్చి తన కాళ్లకు మొక్కి వెళ్లడం ఇప్పటికీ గుర్తుందని ఆమె అన్నారు. చాలా మంది హీరోయిన్లు నీలాంబరి పాత్రను చేయాలని అనుకంటారని కాని, తనకు మాత్రం ఓ పాత్ర చేస్తే బాగుండని ఇప్పటికీ అనుపిస్తుంటుందని అన్నారు. అంతఃపురంలోని సౌందర్యలాంటి పాత్ర తన కెరీర్​లో ఉన్న కలగా పేర్కొన్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తనకు ఆదర్శమని అన్నారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని వాటన్నింటిని నిలదొక్కుకుని ఎదిగిన క్రమం ఆమెకు అభిమానిగా చేసిందని తెలిపారు. ఆమెను కలవకపోయినా.. క్వీన్​ సిరీస్​లో ఆమె పాత్రను చేయడం ఆనందకరమని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)