అంతఃపురంలో సౌందర్య పాత్ర నేను చేస్తే బాగుండనిపించింది!
November 07, 2021
0
తన కెరీర్లో ఎన్నో పాత్రలు చేసినప్పటికీ నరసింహా సినిమాలోని నీలాంబరి పాత్ర ఎంతో స్పెషల్ అని రమ్యకృష్ణ తెలిపారు. మరోవైపు, అమ్మోరు సినిమా తనకు మంచి గుర్తింపు తెచ్చిందని అన్నారు. ఆ సినిమా విడుదలైన కొద్ది రోజుల తర్వాత.. ఏదో షూటింగ్లో ఉండగా.. కొంత మంది మహిళలు వచ్చి తన కాళ్లకు మొక్కి వెళ్లడం ఇప్పటికీ గుర్తుందని ఆమె అన్నారు. చాలా మంది హీరోయిన్లు నీలాంబరి పాత్రను చేయాలని అనుకంటారని కాని, తనకు మాత్రం ఓ పాత్ర చేస్తే బాగుండని ఇప్పటికీ అనుపిస్తుంటుందని అన్నారు. అంతఃపురంలోని సౌందర్యలాంటి పాత్ర తన కెరీర్లో ఉన్న కలగా పేర్కొన్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తనకు ఆదర్శమని అన్నారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని వాటన్నింటిని నిలదొక్కుకుని ఎదిగిన క్రమం ఆమెకు అభిమానిగా చేసిందని తెలిపారు. ఆమెను కలవకపోయినా.. క్వీన్ సిరీస్లో ఆమె పాత్రను చేయడం ఆనందకరమని అన్నారు.