కమర్షియల్‌ సిలిండర్‌ ధర పెంపు

Telugu Lo Computer
0


కమర్షియల్‌ సిలిండర్‌ ధరను రూ.266 లు పెంచాయి. ఇవి నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెంచిన ధరలతో కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.2000 దాటింది. అంతకు ముందు కమర్షియల్‌ సిలిండర్ ధర రూ.1735 గా ఉండేది. 19 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధర ముంబైలో రూ.1950, చెన్నైలో రూ.2133, కోల్‌కతాలో రూ.2073కు చేరుకుంది. కమర్షియల్‌ సిలిండర్‌ ధరలు పెంపుతో దుకాణాదారులు ఆందోళనకు గురువుతున్నారు. కమర్షియల్‌ సిలిండర్లను ఎక్కుగా హోటల్స్‌, రెస్టారెంట్లలో వాడుతుంటారు. ఢిల్లీలో ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.899.50గా ఉంది.  అక్టోబర్‌ 6వ తేదీన ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ల ధరలు పెరిగాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)