పొనుగంటి వేణు అనే యువకుడు ఓ ప్రైవేట్ కాలేజీలో విధులు నిర్వహిస్తూ తెలంగాణ లోని కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోనే నివసిస్తున్నాడు. అయితే ఆదివారం రాత్రి సరదగా స్నేహితులతో కలిసి తిరిగిన అతను, రాత్రి సమయంలో హుజురాబాద్ రోడ్లో గల అభిరామ్ బార్ ఎదురుగా ఉన్న రోడ్డు దగ్గర స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్నాడు. ఉన్నట్టు ఉండి ఒక్కసారిగా పోలీసుల సైరన్ వినపడడంతో వారందరూ పారిపోవడం మొదలు పెట్టారు. ఆ సమయంలో దగ్గరిలో ఉన్న బావి గమనించని వేణు అందులో పడిపోయాడు. స్నేహితులు అతన్ని కాపాడటానికి ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. మృతుడికి భార్య ఇద్దరు చిన్న కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వేణు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి
Post a Comment
0Comments
3/related/default