కాలానికి తగ్గట్లుగా అందరూ మారాల్సిన అవసరముందని, ఇది పాత రాతి యుగం కాదని, సమయానుకూలంగా మన మైండ్ సెట్ మారాలనీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. టీనేజీ అబ్బాయిలు బైకులపై ఇష్టానుసారం తిరుగుతున్నప్పుడు అమ్మాయిలకెందుకు ఆంక్షలు పెట్టాలని అన్నారు. అమ్మాయిలు ఇష్టపూర్వకంగా ఏ అబ్బాయితోనైనా వెళుతుంటే ఆపడానికి మనమెవరం అని ప్రశ్నించారు. యువత తన మైండ్ సెట్ మార్చుకోవాలని అమ్మాయిలకు సముచిత గౌరవం, స్థానం కల్పించాలని అన్నారు. తల్లులు అమ్మాయి, అబ్బాయి ఇద్దరినీ ఒకే విధంగా ట్రీట్ చేయాలని, అమ్మాయిలకు మాత్రమే ఆంక్షలు వర్తింప చేయడం తగదనీ అన్నారు.
అబ్బాయిలు తిరిగితే తప్పులేదా?
October 19, 2021
0