ఛార్జింగ్లైట్లో ఆరు కిలోల బంగారం !
October 19, 2021
0
హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఆరు కిలోల బంగారాన్ని మంగళవారం కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద అక్రమంగా బంగారం ఉన్నట్టు గుర్తించి అధికారులు తనిఖీ చేశారు. అతని వద్ద ఉన్న ఎలక్ట్రిక్ ఛార్జింగ్లైట్లో ఆరు కిలోల బంగారం ఉండటంతో స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.3కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనావేశారు.