మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని భోపాల్కు రెండున్నర కిలోమీటర్ల దూరంలోని సివిల్ లైన్స్లోని త్రిలోచన్ గౌర్ బంగ్లాలో ఓ కలెక్టర్ నివాసం ఉంటున్నాడు. అయితే ఆ ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు పడ్డారు. ఇంట్లో ఉన్న రూ. 30 వేలు, బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. ఇక ఇంట్లో డబ్బులు లేనప్పుడు తాళం ఎందుకు వేయడం.. కలెక్టర్ అని ఓ చిటీపై రాసి దొంగలు వెళ్లిపోయారు. పదిహేను రోజుల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన కలెక్టర్ ఆ లేఖను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. రూ. 30 వేలు, బంగారు ఆభరణాలు అపహరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
డబ్బుల్లేకపోతే తాళం ఎందుకు వేశావ్..?
October 11, 2021
0