పేపర్‌ గోదామ్‌లో భారీ అగ్నిప్రమాదం

Telugu Lo Computer
0


ఢిల్లీలోని హర్ష్‌ విహార్‌లో ఉన్న పేపర్‌ రోల్‌ గోదామ్‌లో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గోదామ్‌ మొత్తానికి విస్తరించాయి. మంటల ధాటికి మూడంతస్తుల గోదామ్‌ కూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 16 ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. గోదామ్‌లో పనిచేస్తున్న కార్మికులంతా క్షేమంగా ఉన్నారని, ఎవరూ గాయపడలేదని చెప్పారు. సోమవారం తెల్లవారుజామున 3.36 గంటలకు తమకు సమాచారం అందిందని ఢిల్లీ ఫైర్‌ సర్వీస్‌ చీఫ్‌ అతుల్‌ కుమార్‌ తెలిపారు. మంటలను అదుపు చేయడానికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టిందని వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)