ఆంధ్రప్రదేశ్ లో తగ్గుతున్న కరోనా వ్యాప్తి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా దిగివస్తోంది. శనివారంతో పోలిస్తే దాదాపు వంద కేసులు తగ్గాయి. ఒక్క జిల్లాల్లో కూడా రోజువారీ కేసుల సంఖ్య 200 దాటలేదు. 12 జిల్లాల్లో వందలోపే కేసులు నమోదు కాగా.. మూడు జిల్లాలో 10లోపు కేసులు రికార్డయ్యాయి.  గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 45,481 శాంపుల్స్ ని పరీక్షించగా 765 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా బులిటెన్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 161 కేసులు కేసులు నమోదుకాగ, అనంతపురం, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో 10కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో కేవలం ఒక్కరికి మాత్రమే పాజిటివ్ గా తేలింది.. జిల్లా వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు చూస్తే.. అనంతపురం జిల్లాలో 01, చిత్తూరు జిల్లాలో 161, తూర్పుగోదావరి జిల్లాలో 94, గుంటూరు జిల్లాలో 91, కడప జిల్లాలో 47, కృష్ణాజిల్లాలో 70, కర్నూలు జిల్లాలో 03, నెల్లూరు జిల్లాలో 91, ప్రకాశం జిల్లాలో 72, శ్రీకాకుళం జిల్లాలో 14, విశాఖపట్నం జిల్లాలో 22, విజయనగరం జిల్లాలో 09, పశ్చిమగోదావరి జిల్లాలో 90 పాజిటివ్ కేసులు మోదయ్యాయి.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)