అటల్ బిమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకం గడువు పొడిగింపు

Telugu Lo Computer
0

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్  స్కీమ్‌లో ఉన్నవారికి కేంధ్ర  ప్రభుత్వం అటల్ బిమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకం గడువును పొడిగించింది ఈఎస్ఐసీ. కరోనా వైరస్ మహమ్మారి  సృష్టించిన సంక్షోభంలో ఉద్యోగాలు కోల్పోయిన వారిని కేంద్ర ప్రభుత్వం అటల్ బిమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకం ద్వారా ఆదుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్  పొందేందుకు గడువు 2020 డిసెంబర్ 31న ముగిసింది. దీంతో ఆ తర్వాత ఈ స్కీమ్ గడువును 2021 జూన్ 30 వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఆ గడువు కూడా ముగిసింది. దీంతో మరోసారి కేంద్ర ప్రభుత్వం గడువు పొడిగించింది. ఈసారి ఏకంగా ఒక ఏడాది గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2021 జూలై 1 నుంచి 2022 జూన్ 30 వరకు ఈ స్కీమ్‌ను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. అటల్ బిమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకాన్ని 2018 జూలై 1న ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఈఎస్ఐ చందాదారులు ఉద్యోగాలు కోల్పోతే వారిని ఆదుకోవడానికి ఈ స్కీమ్‌ను అందిస్తంది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ చందాదారులు ఉద్యోగం కోల్పోతే ఈ సంస్థ ద్వారా ఆర్థిక సాయం పొందొచ్చు. 90 రోజుల వేనంలో 25 శాతం వేతనం పొందేలా ఈ స్కీమ్ రూపొందించారు. అయితే కరోనా వైరస్ సంక్షోభం సమయంలో ఈ బెనిఫిట్‌ను 50 శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఉద్యోగం కోల్పోయిన 90 రోజుల తర్వాత క్లెయిమ్ చేయాలన్న నిబంధన ఉండేది. ఈ నిబంధనను 30 రోజులకు తగ్గించింది. ఉద్యోగం కోల్పోయిన 30 రోజుల తర్వాత ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందొచ్చు. ఈఎస్ఐసీ చట్టం, 1948 లోని సెక్షన్ 2(9) ప్రకారం జీవితంలో ఒకసారి మాత్రమే ఈ పథకం ద్వారా బెనిఫిట్ పొందొచ్చు. కరోనా వైరస్ మహమ్మారి కాలంలో 50,000 మందికి పైగా ఉద్యోగులు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందారు.

Post a Comment

0Comments

Post a Comment (0)