అందరూ కొత్తవాళ్లే....!

Telugu Lo Computer
0



గుజరాత్​లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. గురువారం గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఆచార్య దేవ్రాత్‌ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. అయితే ఈ మంత్రివర్గంలో అంతా కొత్తవారే నియమితులు కావడం విశేషం.మాజీ సీఎం విజయ్​ రూపానీ కేబినెట్​లోని ఒక్కరికి కూడా ఇప్పుడు చోటుదక్కకపోవడం గమనార్హం. సీఎం పదవిని ఆశించిన మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్​ పటేల్​కు​ కూడా కేబినెట్​లో చోటు కల్పించలేదు. శాసనసభ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన రాజేంద్ర త్రివేది, గుజరాత్ బీజేపీ మాజీ అధ్యక్షుడు జితూ విఘ్నానీ మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు. ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు గవర్నర్‌ ఆచార్య దేవ్రాత్‌, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ అభినందించారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపి గుజరాత్‌ మార్క్‌ పాలనను కొనసాగించాలని సూచించారు. గజేంద్ర సిన్హ్‌ పర్మార్‌, రాఘవ్‌జీ మక్వానా, వినోద్‌ మొరాడియా, దేవభాయ్‌ మాలం, హర్ష్‌ సంఘ్వీ, ముఖేశ్‌ పటేల్‌, నిమిష సుతార్‌, అర్వింద్‌ రాజ్యాని, కుబేర్‌ దిన్‌దాన్‌, కీర్తిసిన్హ్‌ వాఘేలా, జగ్జీశ్‌ పంచాల్‌, బ్రిజేశ్‌ మెర్జా, జితూ చౌదరి, మనీశ వకీల్‌, కానూ భాయ్‌ దేశాయ్‌, కీర్తిసిన్హ్‌ రాణా, నరేశ్‌ పటేల్‌, ప్రదీప్‌సిన్హ్‌ పర్మార్‌, అర్జున్‌ సిన్హ్‌ చౌహాన్‌, రాజేంద్ర త్రివేది, జితూ వాఘానీ, రిషికేశ్‌ పటేల్‌, రాఘవ్జీ పటేల్‌, పూర్ణేశ్‌ మోదీ మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ ఆధ్వర్యంలో తొలిసారి మంత్రివర్గం సమావేశం జరిగింది. కాగా, 2022 ఎన్నికలకు భూపేంద్ర పటేల్‌ ఈ టీమ్‌తో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)