ఈ నెల చివరిలో మోడీ అమెరికా పర్యటన
September 04, 2021
0
సెప్టెంబర్ చివరి వారంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాకు వెళ్లనున్నారు. వాషింగ్టన్ డిసి, న్యూయార్క్ల్లో పర్యటిస్తారని ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ..ప్రధాని మోడీ పర్యటించడం ఇదే తొలిసారి. సెప్టెంబర్ 22-27ల మధ్య ఆయన అమెరికా పర్యటన ఉండనుందని తెలుస్తోంది. బైడెన్తో మోడీ భేటీ కానున్నారు. కాగా, వీరిద్దరికీ వ్యక్తిగతంగా తొలి సమావేశం. ఆఫ్గనిస్తాన్లో జరిగిన అధికార మార్పిడిపై బైడెన్తో చర్చింనున్నారని తెలుస్తోంది.